యాప్నగరం

హైకోర్టు సీజేగా ఉజ్జల్ భూయన్ ప్రమాణస్వీకారం.. ఒకే వేదికపై గవర్నర్, సీఎం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయన్ ఇవ్వాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ఒకే వేదికపై కనిపించారు.

Authored byRaj Kumar | Samayam Telugu 28 Jun 2022, 11:08 am
తెలంగాణ హైకోర్టు ఐదో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయించారు. సరిగ్గా తొమ్మిది నెలల కిందట రాజ్‌భవన్ వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తాాజాగా సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాాల్గొనేందుకు రాజ్‌భవన్‌కు వచ్చారు. మీడియాకు అభివాదం చేస్తూ రాజ్‌భవన్‌లోనికి వచ్చిన సీఎం.. ముందుగా గవర్నర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటు జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సీఎం పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Samayam Telugu తెలంగాణ సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్, సీఎం


గత కొద్దిరోజులుగా గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ మధ్య క్రమంగా గ్యాప్‌ పెరుగుతూ వచ్చింది. ఈ పరిణామాలపై కొన్ని సందర్భాల్లో గవర్నర్‌ తమిళిసై బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో, గవర్నర్‌ ఆహ్వానించినా కొన్ని కార్యక్రమాలకు సీఎం కేసీఆర్‌తో పాటు అధికార పార్టీకి చెందిన వారు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే తాజా కార్యక్రమంలో గవర్నర్ సీఎం ఒకే వేదికపై కనిపించారు..

ఇటు ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డి, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు రాజ్‌భవన్‌లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.