యాప్నగరం

నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్

స్వగ్రామంలో నోముల భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొని నివాళులర్పించారు. నోముల కుటుంబాన్ని

Samayam Telugu 3 Dec 2020, 4:12 pm
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం పాలెం గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు నివాళులర్పించారు. నోముల భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళుర్పించారు సీఎం కేసీఆర్‌. అనంతరం నోముల కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్‌ పరామర్శించి ఓదార్చారు.
Samayam Telugu నోముల అంత్యక్రియల్లో కేసీఆర
kcr at nomula funerals


Read More: GHMC Elections: చివరి గంటలో భారీగా పెరిగిన పోలింగ్..? ఎలా..?

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో సహా మంత్రులు మహముద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, పలువురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా పాల్గొని నోములకు నివాళులర్పించారు. తమ అభిమాన నాయకుడి అంతిమ యాత్రలో పెద్దు ఎత్తున కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నార్కట్‌ పల్లి కామినేని ఆస్పత్రిలో భద్రపరిచిన నోముల భౌతిక కాయాన్ని ఇవాళ ఉదయం 7.30 గంటలకు మొదట నకిరేకల్‌కు తరలించారు. ఆ తర్వాత ఆయన స్వగ్రామమైన పాలెంకు తీసుకెళ్లారు. నోమల అంతిమయాత్రలో అనేకమంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.