యాప్నగరం

ఎవ్వరికీ వ్యక్తిగత ప్రాధాన్యం ఉండొద్దు.. కలెక్టర్ల సదస్సులో కేసీఆర్

Collectors Summit: ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, అడిషనల్‌ కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, ఆయా శాఖల కార్యదర్శులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

Samayam Telugu 11 Feb 2020, 3:26 pm
రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు. ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండకూడదని చెప్పారు. మేథోమథనం, అన్ని రకాల చర్చలు, అసెంబ్లీలో విస్తృత చర్చ, విషయనిపుణుల సంప్రదింపుల అనంతరం ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తోందని గుర్తు చేశారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, అడిషనల్‌ కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, ఆయా శాఖల కార్యదర్శులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
Samayam Telugu KCR-Muncicipal


Also Read: కరోనా ఎఫెక్ట్: గాంధీ ఆస్పత్రి వైద్యుడి ఆత్మహత్యాయత్నం..

పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అవలంబిస్తున్న మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలని చెప్పారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు-విధానాలు-పథకాలు-కార్యక్రమాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యం కావాలని ముఖ్యమంత్రి చెప్పారు.

Also Read: ప్రేమ కోసం ముస్లిం మతంలోకి యువకుడు: విచారణలో ఊహించని షాక్

ప్రధానంగా పాలనలో వేగం, ప్రజలకు మరింత చేరువకావడం, ప్రజల వినతులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మరింత సమర్థంగా అమలుచేయడం.. వంటి ప్రధాన అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా పురపాలక, పంచాయతీరాజ్‌చట్టాల అమలుతోపాటు కొత్త రెవెన్యూచట్టం, భూవివాదాలకు అడ్డుకట్ట వేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నట్టు సమాచారం.

Must Read: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు ఇతర మెట్రోల కన్నా ఎక్కువ! ఎందుకిలా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.