యాప్నగరం

రావి కొండలరావు కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం

Pragathi Bhavan: రావి కొండలరావు ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్‌ ప్రార్థించారు. అప్పట్లో రావి కొండల్‌రావు అత్యుత్తమ సహ నటుడిగా ఉండేవారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

Samayam Telugu 28 Jul 2020, 9:40 pm
అలనాటి విలక్షణ నటుడు, రచయిత, రంగస్థల కళాకారుడు అయిన రావి కొండలరావు మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈయన మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. రావి కొండలరావు మరణానికి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సీఎం కార్యాలయం కూడా కేసీఆర్ సంతాపం ప్రకటించినట్లుగా ట్వీట్ చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్‌ ప్రార్థించారు. అప్పట్లో రావి కొండల్‌రావు అత్యుత్తమ సహ నటుడిగా ఉండేవారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
Samayam Telugu కేసీఆర్
kcr


ఇదిలా ఉండగా కొండ‌లరావు గుండెపోటుతో బేగంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న సినీ ర‌చ‌యిత‌గానే కాకుండా న‌టుడిగానూ మంచి పేరు తెచ్చుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.