యాప్నగరం

స్పీకర్ ఇంట్లో లంచ్ చేసిన కేసీఆర్ దంపతులు

ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి తన నివాసంలో ప్రత్యేక లంచ్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ దంపతులను సాదరంగా ఆహ్వానించారు.

Samayam Telugu 23 Sep 2019, 10:11 pm
ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఇంటికి వెళ్లి ఆయణ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం (సెప్టెంబర్ 23) మధ్యాహ్నం స్పీకర్ నివాసంలో కేసీఆర్ దంపతులు భోజనం చేశారు. తమ ఇంటికి భోజనానికి రావాలని స్పీకర్ గతంలో సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి స్పీకర్ అధికారిక నివాసానికి విచ్చేశారు.
Samayam Telugu kcr


కేసీఆర్ దంపతులకు పోచారం కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం విందు భోజం ఏర్పాటు చేశారు. కేసీఆర్ దంపతులతో పాటు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యులు జె సంతోశ్ కుమార్ స్పీకర్ నివాసానికి వచ్చిన వారిలో ఉన్నారు.

Also Read: అమ్మ ప్రేమ కావాలి.. ఓ అమ్మాయి పోరాటం, కదిలించే కథ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.