యాప్నగరం

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

కోవిడ్ నిబంధనలకు లోబడి ప్రజలంతా దసరా సంబరాలు జరుపుకోవాలన్నారు. ఈ ఏడాది కరోనా కారణంగా పండగలన్నీ కళ తప్పిన విషయం తెలిసిందే.

Samayam Telugu 25 Oct 2020, 9:56 am
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండగ సందర్భంగా తెలంగాణ సీఎంఓ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా పండుగ జరుపుకుంటామని సీఎం ఈ సందర్భంగా వివరించారు. కరోనా మహమ్మారిని జయించి రాష్ట్ర ప్రజలు సంతోషంగా, సుసంపన్నంగా జీవించేలా ఆశీర్వదించాలని దుర్గాదేవిని సీఎం కేసీఆర్‌ ప్రార్థించారు. కొవిడ్‌ నిబంధనలకు లోబడి ప్రజలు విజయదశమిని జరుపుకోవాలని ప్రజలను సీఎం కోరారు.
Samayam Telugu kcr new


Read More: కేసీఆర్ మాటలు నమ్మి సన్నరకం సాగు చేసా.. సోషల్ మీడియాలో రైతు ఆవేదన

అలాగే ప్రజలకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి కృప అందరిపై ఉండాలని, చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అపజయాన్ని సైతం తట్టుకొని నిలబడగలిగే శక్తిని, దేన్నైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలని అమ్మవారిని మంత్రి కొప్పుల వేడుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.