యాప్నగరం

భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. మధ్యాహ్నం అత్యవసర సమావేశం

భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితి, తీసుకుంటున్న పునరావాస చర్యలు, తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పేర్కొనాల్సిన అంశాలు తదితర విషయాలపై సమావేశంలో సమీక్ష జరుపుతారు.

Samayam Telugu 15 Oct 2020, 11:28 am
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం 3గంటల పాటు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని ఈ సమీక్షలో ఆయన చర్చించనున్నారు. వర్షాలు, వరదల తదనంతరం తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకొని రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Samayam Telugu సీఎం కేసీఆర్
cm kcr on rains


పలువురు మంత్రులు, వారి కార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌ కలెక్టర్లను సమావేశానికి ఆహ్వానించారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకురావాలని స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్‌లో పలు ముంపు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

మరోవైపు రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వానలు తప్పడం లేదు. మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో గురువారంతో కలిపి మరో రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.