యాప్నగరం

టీడీపీ సీనియర్ నేతతో కేసీఆర్ భేటీ, ఆయన ఇంటికి వెళ్లి..

Banjara Hills: కేసీఆర్ తన మధ్యాహ్న భోజనాన్ని బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఇంట్లోనే చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం కేసీఆర్ క్యాన్వాయ్ ప్రగతి భవన్‌కు చేరుకుంది.

Samayam Telugu 5 Jan 2020, 6:30 pm
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీకి చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని కలిశారు. బంజారాహిల్స్‌లోని కృష్ణారెడ్డి ఇంటికి ఆదివారం వెళ్లిన కేసీఆర్.. ఆయన్ను పరామర్శించారు. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బొజ్జల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు కేసీఆర్‌ ఆయన ఇంటికి వెళ్లినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, కేసీఆర్ తన మధ్యాహ్న భోజనాన్ని బొజ్జల ఇంట్లోనే చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం కేసీఆర్ క్యాన్వాయ్ ప్రగతి భవన్‌కు చేరుకుంది.
Samayam Telugu kcr



Also Read: ‘కాబోయే సీఎం కేటీఆర్’ వార్తలపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీలో సీనియర్ నేత అయిన బొజ్జల.. శ్రీకాళహస్తి నుంచి ప్రాతినిథ్యం వహించారు. 1989-94, 1994-99, 1999-2004, 2009-2014, 2014-19 మధ్యకాలాల్లో బొజ్జల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బొజ్జల తనయుడు సుధీర్ రెడ్డి తెలుగు దేశం తరపున పోటీ చేయడగా వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

Also Read: KTR వల్ల సీఎం కేసీఆర్ ప్రాణాలకు ముప్పు.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణలో పురపాలక ఎన్నికలపై దృష్టి పెట్టారు. శనివారం జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీల గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలతోపాటు, మంత్రులకూ కేసీఆర్ అప్పగించారు. అభ్యర్థి ఎంపిక తర్వాత వచ్చే రెబల్స్ సమస్యను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలే పరిష్కరించాలని కేసీఆర్ తేల్చి చెప్పారు. గ్రూపు రాజకీయాలు తగవని, ఏదైనా కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ పరిధిలో టీఆర్ఎస్ కనుక ఓడిపోతే ఆ జిల్లాకు సంబంధించిన మంత్రుల పదవులు ఊడినట్లేనని కేసీఆర్ హెచ్చరించారు.

Also Read: మరోసారి గొప్ప ఉదారత చాటుకున్న మంత్రి కేటీఆర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.