యాప్నగరం

Himanshu Rao: సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు గాయాలు.. ఆస్పత్రిలో చేరిక

బుధవారం రాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో హిమాన్షును చేర్చినట్లు సమాచారం తుంటి, మోకాలికి ఫ్యాక్ఛర్ అయినట్లు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు.

Samayam Telugu 1 Oct 2020, 8:10 am
సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షుకు గాయాలయ్యాయి. కాలికి ఫ్యాక్చర్‌ అయినట్లు తెలిసింది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నహిమాన్షును చికిత్స నిమిత్తం బుధవారం రాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. కనీసం నిలబడలేక పోతున్న హిమాన్షుకు వైద్యులు సీటీస్కాన్‌ చేశారు. తుంటి, మోకాలికి ఫ్యాక్చర్‌ అయినట్లు గుర్తించిన వైద్యులు అతనికి చికిత్సచేసి కట్టుకట్టారు. అయితే ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో హిమాన్షు గాయపడినట్లు సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.
Samayam Telugu సీఎం కేసీఆర్ మనవడికి గాయాలు


Read More: ఎమ్మెల్సీగా కవిత గెలుపు కోసం టీఆర్ఎస్ నేతల పక్కా ప్లాన్

ప్రస్తుతం హిమాన్ష్ కాలినొప్పితో బాధపడుతుండటంతో మంత్రి కేటీఆర్ దంపతులు హాస్పిటల్ లోనే కొడుకుతో పాటే వున్నట్లు సమాచారం. ఇక సీఎం కేసీఆర్ కూడా మనవడి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు హాస్పిటల్ డాక్టర్లకు ఫోన్ చేసి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇక కేసీఆర్‌కు కూడా హిమాన్షు అంటే ఎంతో ప్రేమ. ఎన్నో సందర్భాల్లో ఆయన ఈ విషయాన్ని బహిరంగంగా కూడా చెప్పారు. ఇక ఆయనకు ఏ కాస్త టైం దొరికినా.. మనవడు, మనవరాళ్లో సరదాగా గడుపుతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.