CM KCR: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరింత దూకుడు పెంచారు. టీఆర్ఎస్ అధినేతగా పార్టీ కార్యక్రమాలతో పాటు సీఎంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించడంతో పాటు ఇప్పటికే ప్రకటించిన పథకాలకు నిధులు మంజురు చేసే పనిలో ఉన్నారు. మరోవైపు కొత్త అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి పనులను షురూ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోన్నారు.
అభివృద్ధి పనుల్లో భాగంగా సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మత్తుల కోసం రూ.2,500 కోట్ల నిధులను మంజురూ చేశారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల మరమ్మత్తుల కోసం రోడ్లు, భవనాల శాఖ వీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మత్తు పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ఆదేశాలతో వేసవికాలంలోపు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు మరమ్మత్తులు చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.
రోడ్లు, భవనాల శాఖ అధికారులతో తాజాగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ రోడ్ల పనులకు కేసీఆర్ రూ.2,500 విడుదల చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న కల్వర్టుల మరమ్మత్తులు, రోడ్ల పునరుద్దరణ పనులు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తుల కోసం వీటిని వినియోగించనున్నట్లు తెలిపారు. డిసెంరబ్ 15లోగా కాంట్రాక్టర్లకు వర్క్ అగ్రిమెంట్లు అందేలా చేసి త్వరితగతిన పనులు ప్రారంభించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నియోజకవర్గాల వారీగా పనులు చేపట్టాలని, స్థానిక ఎమ్మెల్యేల సూచనలతో పనులు నిర్వహించాలని జిల్లాల సూపరిటెండెంటట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు ప్రశాంత్ రెడ్డి సూచించారు. రోడ్ల మరమ్మత్తులను వేసవి కాలంలోపు పూర్తి చేయాలని సూచించారు. కాంట్రాక్టర్లు పనులు వేగవంతంగా చేసేలా చూడాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు. కాగా రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లు, కల్వర్టులు బాగా దెబ్బతిన్నాయి. తాత్కాలికంగా వాటికి మరమ్మత్తులు చేశారు. ఇప్పుడు వాటిని పునరుద్దరించడంతో పాటు వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో ఇంజినీర్లు సంప్రదాయక పద్దతులను వదిలేసి ఆధునాతన, డైనమిక్ పద్దతులు ఉపయోగించాలని కేసీఆర్ సూచించారు. రోడ్ల మరమ్మత్తులు అనేవి నిరంతర ప్రక్రియ అని, అది కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
Read More Telangana News And Telugu News
అభివృద్ధి పనుల్లో భాగంగా సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మత్తుల కోసం రూ.2,500 కోట్ల నిధులను మంజురూ చేశారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల మరమ్మత్తుల కోసం రోడ్లు, భవనాల శాఖ వీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మత్తు పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ఆదేశాలతో వేసవికాలంలోపు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు మరమ్మత్తులు చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.
రోడ్లు, భవనాల శాఖ అధికారులతో తాజాగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ రోడ్ల పనులకు కేసీఆర్ రూ.2,500 విడుదల చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న కల్వర్టుల మరమ్మత్తులు, రోడ్ల పునరుద్దరణ పనులు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తుల కోసం వీటిని వినియోగించనున్నట్లు తెలిపారు. డిసెంరబ్ 15లోగా కాంట్రాక్టర్లకు వర్క్ అగ్రిమెంట్లు అందేలా చేసి త్వరితగతిన పనులు ప్రారంభించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నియోజకవర్గాల వారీగా పనులు చేపట్టాలని, స్థానిక ఎమ్మెల్యేల సూచనలతో పనులు నిర్వహించాలని జిల్లాల సూపరిటెండెంటట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు ప్రశాంత్ రెడ్డి సూచించారు. రోడ్ల మరమ్మత్తులను వేసవి కాలంలోపు పూర్తి చేయాలని సూచించారు. కాంట్రాక్టర్లు పనులు వేగవంతంగా చేసేలా చూడాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు. కాగా రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లు, కల్వర్టులు బాగా దెబ్బతిన్నాయి. తాత్కాలికంగా వాటికి మరమ్మత్తులు చేశారు. ఇప్పుడు వాటిని పునరుద్దరించడంతో పాటు వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో ఇంజినీర్లు సంప్రదాయక పద్దతులను వదిలేసి ఆధునాతన, డైనమిక్ పద్దతులు ఉపయోగించాలని కేసీఆర్ సూచించారు. రోడ్ల మరమ్మత్తులు అనేవి నిరంతర ప్రక్రియ అని, అది కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
Read More Telangana News And Telugu News