యాప్నగరం

ఆర్టీసీ సమ్మె: హైకోర్టు ఆదేశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

RTC Strike అంశంపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమ్మె విషయంలో ముందుకెళ్లాల్సిన తీరుపై సమాలోచనలు జరిపారు.

Samayam Telugu 22 Oct 2019, 7:57 pm
ర్టీసీ సమ్మె, హైకోర్టు ఆదేశాలపై రవాణా శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి మంగళవారం (అక్టోబర్ 22) అందాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధికారులతో సమావేశమయ్యారు.
Samayam Telugu kcr


హైకోర్టు ఆదేశాల్లో పేర్కొన్న అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం తరపున ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఉన్నతాధికారులతో కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: హైదరాబాద్ మెట్రో ఆల్ టైమ్ రికార్డ్.. ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్

ప్రగతి భవన్‌లో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సలహాదారు అనురాగ్‌ శర్మ, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌ కుమార్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Video: ఊడిన చక్రం, స్కూలు వ్యాన్ బీభత్సం.. చిన్నారులకు తప్పిన ప్రమాదం

అంతకుముందు ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ భేటీ అయ్యారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో చేయాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు ఆదేశాలపై చర్చించారు. అనంతరం వారిద్దరూ సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.