యాప్నగరం

కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష.. మర్కజ్ బృందాలపై ఆరా

Telangana: అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ చర్యలు, బియ్యం పంపిణీ తదితర అంశాలపై ఆరా తీశారు. కీలక ఆదేశాలు జారీ చేశారు.

Samayam Telugu 5 Apr 2020, 6:10 pm
రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు, నియంత్రణ చర్యలపై ఆరా తీశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ భవన్‌లో ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి సంబంధించిన వివరాలు, వారికి పరీక్షలు నిర్వహించే కార్యక్రమాలు ఎంత వరకు వచ్చాయనే విషయాలను అధికారులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. హోం క్వారంటైన్‌, ప్రభుత్వ క్వారంటైన్లలో ఎంత మంది ఉన్నారు? ఇప్పటివరకు ఎంత మందిని పంపించారు తదితర వివరాలపైనా ఆయన ఆరా తీశారు.
Samayam Telugu cm kcr


లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలు, వలస కార్మికులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం సాగుతున్న తీరుపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. భవిష్యత్ కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

ఆదివారం (ఏప్రిల్ 5) మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.