యాప్నగరం

ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష.. చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

RTC Strike అంశంలో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ, హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులతో చర్చించారు.

Samayam Telugu 14 Nov 2019, 9:10 pm
ర్టీసీ అంశంపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రూట్ల ప్రైవేటీకరణ అంశంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్‌లో గురువారం (నవంబర్ 14) నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, రవాణా శాఖ కమిషనర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎన్‌. ప్రసాద్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచందర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.
Samayam Telugu kcr
కేసీఆర్


రాష్ట్రంలోని 5100 రూట్లలో ప్రైవేటు పర్మిట్లపై హైకోర్టులో గురువారం విచారణ కొనసాగింది. రూట్‌ పర్మిట్లపై ఇచ్చిన స్టేను న్యాయస్థానం సోమవారం వరకు పొడిగించింది. కేసు విచారణనను సోమవారానికి వాయిదా వేసింది. ఉన్నత న్యాయస్థానంలో విచారణ సందర్భంగా ప్రస్తావించిన అంశాలను అడ్వొకేట్‌ జనరల్‌.. సీఎం కేసీఆర్‌కు వివరించినట్లు సమాచారం.

Also Read: ఆర్టీసీ సమ్మెపై మెట్టు దిగిన కార్మికులు

ఆర్టీసీ సమ్మె విషయంలో జేఏసీ ఓ మెట్టు దిగుతూ నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని.. ప్రభుత్వం చర్చలకు పిలవాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి గురువారం సాయంత్రం కోరారు. దీనిపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.