యాప్నగరం

తెలంగాణ కేబినెట్ భేటీ.. ‘ఆర్థికం’పై కీలక నిర్ణయాలు

CM KCR అధ్యక్షతన ప్రగతి భవన్‌లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Samayam Telugu 11 Dec 2019, 6:21 pm
సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్‌లో బుధవారం (డిసెంబర్ 11) సాయంత్రం ప్రారంభమైన కేబినెట్ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రధానంగా చర్చ జరగనుంది. లోకాయుక్త చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్‌, ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇటీవల ఇచ్చిన హామీలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు తదితర అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu తెలంగాణ కేబినెట్


కాళేశ్వరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి రూ.1500 కోట్ల రుణం, పవర్‌ ఫైనాన్స్‌ కార్సొరేషన్‌ నుంచి రూ.14,075 కోట్ల రుణానికి కేబినెట్‌ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా దుమ్ముగూడెం వద్ద కొత్త ఆనకట్ట నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వివిధ శాఖల్లో ఆర్థిక నియంత్రణ పాటించడం, కొన్ని శాఖలకు నిధుల తగ్గింపుపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.