యాప్నగరం

15 రోజుల్లో ఆస్తులన్నీ ఆన్ లైన్.. అధికారులకు కేసీఆర్ కీలక ఆదేశాలు

ఆస్తులన్నీ ఆన్ లైన్‌లో నమోదు కోసం సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలంతా అధికారులకు సహకరించలని కోరారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

Samayam Telugu 23 Sep 2020, 8:48 am
15 రోజుల్లోగా ఆస్తులన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఇప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదు కాని ప్రజల ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్ లైన్‌లో వెంటనే నమోదు చేయాలని సూచించారు. ప్రజలు తమ ఆస్తుల వివరాలు అధికారులకు అందజేయాలని సీఎం కోరారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోపే పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖలకు చెందిన అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటి వరకు నమోదు కాని ఆస్తుల వివరాలను వెంటనే 100 శాతం ఆన్‌లైన్‌లో చేర్చాలని సీఎం సూచించారు.
Samayam Telugu సీఎం కేసీఆర్
cm kcr


Read More:
వరంగల్: కన్న కొడుకును సజీవ దహనం చేసిన తల్లి

భూ రికార్డుల నిర్వహణ నూటికి నూరుశాతం పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్‌కు శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు కేసీఆర్. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్‌ రూపకల్పనపై మంగళవారం ప్రగతిభవన్‌ కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను పురపాలక, జిల్లా, మండల, పంచాయతీ అధికారులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం జిల్లా, పంచాయతీ అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.