యాప్నగరం

తెలంగాణ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం.. నేడు 11.30కు బడ్జెట్ ప్రసంగం

KCR అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం రాష్ట్ర బడ్జెట్ 2020కి ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు తొలిసారి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.

Samayam Telugu 8 Mar 2020, 9:05 am
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రివర్గం శనివారం ఆమోదించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం (మార్చి 7) సాయంత్రం ప్రగతి భవన్‌లో సమావేశమైన మంత్రివర్గం.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన బడ్జెట్‌పై చర్చించి ఆమోదించారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆదివారం ఉదయం 11.30 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగం చేయనున్నారు.
Samayam Telugu cabinet


శాసనమండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. హరీశ్ రావుకు ప్రవేశపెట్టనున్న తొలి వార్షిక పద్దుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బడ్జెట్‌లో కేసీఆర్ సర్కార్ కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. మంత్రులు ఇప్పటికే ఇందుకు సంబంధించి కొన్ని సంకేతాలిచ్చారు.

Also Read: కేసీఆర్ అమ్ములపొది నుంచి మరో రెండు పథకాలు.. విపక్షాలు మటాషేనా!

సొంత ఆదాయాలపై పూర్తి ధీమాతో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్‌ను ప్రతిపాదిస్తోంది. ప్రాధాన్య పథకాలు, ఎన్నికల హామీలు, అభివృద్ధి లక్ష్యాలు, ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత బడ్జెట్‌ కంటే 15-16 శాతం పెంచి తీసుకురావాలని నిర్ణయించింది. రూ.1.56 లక్షల కోట్ల నుంచి రూ.1.59 లక్షల కోట్ల మధ్య బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.