యాప్నగరం

శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ సమీక్ష

ఈ భేటీలో డీజీపీతో పాటు డీజీ స్థాయి అధికారుల నుంచి జిల్లా అధికారులు హాజరయ్యారు. మావోల కదలికలపై కూడా ఈ సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు.

Samayam Telugu 7 Oct 2020, 12:46 pm
ప్రగతి భవన్ లో పోలీస్ ఉన్నతాధి కారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. శాంతి బద్రతలపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో డిజీపీతో సహా కమీషనర్స్, డిజీ స్థాయి అధికారుల అన్నీ జిల్లాల అధికారుల హాజరయ్యారు. తెలంగాణలో మావో కదలికల నేపధ్యంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. హోం, ఆటవీశాఖ మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్, డీజీపీ, పీసీసీఎఫ్, ఆయా శాఖల కార్యదర్శులు, అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో ప్రగతిభవన్లో సీఎంతో సమావేశం అయ్యారు.
Samayam Telugu సీఎం కేసీఆర్
cm kcr


Read More: మరో రెండు నెలల్లో గ్రేటర్ ఎన్నికలు.. ఎన్నికల కమమిషనర్ పార్థసారధి

దీంతో పాటు మహిళల భద్రత, డ్రగ్స్, అక్రమ రవాణా అడ్డుకట్టపై సీఎం సమీక్షించనున్నారు. అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి తదితర మాదక దృవ్యాల నియంత్రణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు . ఇటీవల కాలంలో రాష్ట్రంలో మావోల కదలికలపై పోలీసులు దృష్టిసారించిన విషయం తెలిసిందే.ప్ భద్రద్రి కొత్తగూడెం జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. ఎక్కడికక్కడ మావోలను పట్టుకొని ఎన్ కౌంటర్లు జరిపారు. మరోవైపు ఇప్పటికే అడవుల్లో మావోల కోసం వేట కొనసాగుతోనే ఉంది. డ్రోన్ల సాయంతో మావోల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.