యాప్నగరం

చినజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్

Chinna Jeeyar Swamy: ఛండీయాగం, సుదర్శనయాగం, గంగమ్మ పూజలు చేయనున్నారు. చండీయాగం పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. అనంతరం కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్‌ను కేసీఆర్ దంపతులు ప్రారంభిస్తారు.

Samayam Telugu 28 May 2020, 12:46 am
చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కలిశారు. బుధవారం సాయంత్రం శంషాబాద్‌లోని ముచ్చింతల్‌ ఆశ్రమానికి వెళ్లిన సీఎం.. కొండపోచమ్మ సాగర్ జలాశయం ప్రారంభోత్సవానికి చినజీయర్ స్వామిని ఆహ్వానించారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ అక్కడ యాగాలు చేయనున్నారు. ఈ నెల 29న ఆయన ఏకకాలంలో యాగాలు చేయనున్నట్లుగా సమాచారం. శుక్రవారం ఉదయం 7 గంటలకు కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ పూజలు నిర్వహిస్తారు.
Samayam Telugu చినజీయర్ స్వామిని కలిసిన కేసీఆర్, చిత్రంలో జూపల్లి రామేశ్వరరావు
chinnajeeyar swami


అదే సమయంలో ఛండీయాగం, సుదర్శనయాగం, గంగమ్మ పూజలు చేస్తారు. చండీయాగం పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. అనంతరం కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్‌ను కేసీఆర్ దంపతులు ప్రారంభిస్తారు.

ప్రగతి భవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్ మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిపిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌, నియంత్రిత సాగు విధానం తదితర అంశాలపై చర్చ అనంతరం నేరుగా ఆయన వద్దకు బయల్దేరారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.