యాప్నగరం

కళాతపస్వి కె విశ్వనాథ్ నివాసానికి కేసీఆర్.. ఆరోగ్యం గురించి ఆరా తీసిన సీఎం

CM KCR దర్శకుడు కె విశ్వనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు.

Samayam Telugu 11 Aug 2019, 7:20 pm
ర్శకుడు, కళాతపస్వి కె విశ్వనాథ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కె విశ్వనాథ్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 11) మధ్యాహ్నం ఫిలింనగర్‌లోని విశ్వనాథ్ నివాసానికి సీఎం కేసీఆర్ విచ్చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. కేసీఆర్ వెంట పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు నేతలు ఉన్నారు.
Samayam Telugu Viswanath
కె విశ్వనాథ్


కేసీఆర్ ఓ అభిమానిగా మాత్రమే తనను కలిశారని కళాతపస్వి విశ్వనాథ్ తెలిపారు. ఆయనలో విభిన్న కోణాలు ఉండటం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని వెల్లడించారు. కేసీఆర్ తనను కలిసి వెళ్లిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు.

దర్శకుడిగా, నటుడిగా కె విశ్వనాథ్ తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేశారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ కళాఖండాలుగా నిలిచిపోయాయి. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్బాంధవుడు, స్వర్ణకమలం, శుభసంకల్పం లాంటి ఎన్నో హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆత్మగౌరవం సినిమాతో ఆయన మెగాఫోన్‌ పట్టారు.

Read Also: తప్పులో కాలేసిన చంద్రబాబు.. ఏకిపారేసిన రాంబాబు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.