యాప్నగరం

గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ.. ఆర్టీసీపై సంచలనమేనా!

Telangana Governor తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. తమిళిసై ప్రమాణం స్వీకారం తర్వాత సుమారు 3 నెలల తర్వాత గవర్నర్‌ను సీఎం కలుస్తుండటం గమనార్హం.

Samayam Telugu 25 Nov 2019, 6:51 pm
వర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో సోమవారం (నవంబర్ 25) మధ్యాహ్నం గవర్నర్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. కొత్త రెవెన్యూ చట్టం, ఆర్టీసీ ప్రైవేటీకరణ, అసెంబ్లీ సమావేశాలు సహా పలు అంశాలపై గవర్నర్‌తో సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె వ్యవహారం, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.
Samayam Telugu Governor
గవర్నర్ తమిళిసై


తమిళసై గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం కేసీఆర్ ఆమెను తొలిసారిగా కలుస్తుండటం గమనార్హం. దాదాపు 3 నెలల తర్వాత గవర్నర్‌ను కలుస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయానికే మొగ్గు చూపుతుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read: ఆర్టీసీపై మరో పిటిషన్..

విధుల్లో చేరడానికి సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ నిర్ణయంపై అటు కార్మికుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. డ్యూటీల్లో చేరతామంటూ డిపోల ముందు బారులు తీరినా.. మాకు ఆదేశాలు లేవంటూ అధికారులు నిరాకరిస్తుండటంతో వారు నిరాశకు గురవుతున్నారు.

కొత్త రెవెన్యూ చట్టంతో ఆ సమస్యలకు ఫుల్‌స్టాప్..
ప్రజలకు సత్వరమే సేవలు అందించేలా పటిష్టమైన రెవెన్యూ చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కొత్త చట్టంపై అధికారులతో ఆయన ఇప్పటికే విస్తృతంగా చర్చించారు. భూ క్రయవిక్రయాలు పూర్తై, రిజిస్ట్రేషన్ జరగిన వెంటనే ఆటోమేటిక్‌గా ఆ భూమి అమ్మినవారి ఖాతా నుంచి డిలీట్ అయి కొనుగోలు చేసిన రైతు ఖాతాలో జమ అయ్యేలా మార్పులు చేస్తున్నారు. ఈ మేరకు పట్టాదార్ పాసు పుస్తకంలోనూ నమోదు కావాలని అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

Also Read: ఆర్టీసీ సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటన

కొత్త రెవెన్యూ చట్టంతో భూ వివాదాలకు శాశ్వతంగా ఫుల్‌స్టాప్ పడాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. సమస్య ఉందని, తన భూమిని రికార్డుల్లోకి ఎక్కించాలని, పహాణీలు కావాలని ఇకపై ఏ రైతు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని సీఎం కేసీఆర్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.