యాప్నగరం

ఇక కేంద్రంతో బిగ్ ఫైట్.. ఇక నిరసనలు, ధర్నాలే.. టీఆర్ఎస్ నిర్ణయం

Parliament Session 2020: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల సమావేశం జరిగింది. ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు సీఎస్ సోమేశ్‌కుమార్‌ ఇందులో పాల్గొన్నారు.

Samayam Telugu 11 Sep 2020, 7:09 am
తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలు, హక్కుల సాధన కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్లమెంటరీ పార్టీ పక్ష నేత కే కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రం హామీల అమలు విషయంలో వైఫల్యాలపై పార్లమెంటు లోపలా, బయటా నిరసనలు తెలపాలని, అవసరమైతే ధర్నాలు చేయాలని అన్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, బకాయిల కోసం తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయాలని, కలిసొచ్చే పార్టీల మద్దతు తీసుకొని పోరాడాలని, అలాగే కొత్త విద్యుత్‌ చట్టాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల సమావేశం జరిగింది.
Samayam Telugu టీఆర్ఎస్ పార్లమెంటరీపక్ష సమావేశం
cm kcr meets with trs mps


పార్లమెంటరీ పార్టీ పక్ష నేత కే కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు, సీఎస్ సోమేశ్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగు హామీలు తదితర అంశాలపై చర్చించారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం ఎంపీలు కేకే, నామా తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

ఏడేళ్లుగా ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు
‘ఏడేళ్లుగా కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదు. మనకు రావాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఇక కేంద్రాన్ని వదిలే ప్రసక్తే లేదు. పార్లమెంట్‌లో పోరాటం చేస్తాం. ఇక దాన్ని యుద్ధం అన్నా ఫర్వాలేదు. మన సీఎం కేసీఆర్‌ గత ఏడేళ్లుగా సమస్యలపై కేంద్రానికి ఉత్తరాలు రాసి రాసి అలసిపోయారు. కేంద్రం తెస్తున్న కొత్త విద్యుత్‌ చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. ఆ చట్టంతో కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తోంది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంటులో మేం చేసే పోరాటానికి ఇక్కడి బీజేపీ ఎంపీలు కలిసి వస్తారో లేదో చూడాలి. వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లను ఏర్పాటు చేయడాన్ని బీజేపీ ఎంపీలు సమర్థిస్తారా?’’ అని కేకే, నామాలు విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.