యాప్నగరం

ఢిల్లీకి కేసీఆర్.. కుటుంబంతో వెళ్లిన సీఎం, రేపే శంకుస్థాపన

దేశ రాజధానిలో గులాబీ పార్టీ కార్యాలయానికి ముహూర్తం ఖరారైంది. టీఆర్‌ఎస్ అధినేత సహా ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హస్తిన బాట పట్టారు. రేపు మధ్యాహ్నం భూమిపూజ.

Samayam Telugu 1 Sep 2021, 6:54 pm
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రేపు ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. భూమి పూజ కార్యాక్రమంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలసి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమయ్యారు. ఢిల్లీ చేరుకున్న ఆయనకు మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్, మల్లారెడ్డి, ఎంపీలు స్వాగతం పలికారు. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కార్యాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఢిల్లీలోని వసంత్ విహారం మెట్రో స్టేషన్ సమీపంలో కేంద్రం 1300 గజాల స్థలాన్ని కేటాయించింది. రేపు భూమి పూజ చేసి.. ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాలని టీఆర్‌ఎస్ అధినేత భావిస్తున్నారు. రెండు రోజుల పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్ తిరిగి రానున్నారు.
Samayam Telugu ఢిల్లీలో సీఎం కేసీఆర్
kcr


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.