యాప్నగరం

ప్రగతి భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించిన కేసీఆర్

ప్రగతి భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పుష్పంజాలి ఘటించారు.

Samayam Telugu 26 Jan 2021, 12:47 pm
దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సీఎం రాజకీయ సలహాదారు, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌ కుమార్‌, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మతోపాటు పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Samayam Telugu ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్


మరోవైపు జిల్లాల వ్యాప్తంగా కూడా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. . పలు జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతనిధులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం సమర్పించారు. పోలీసుల పరేడ్‌, శకటాల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని చారిత్రాత్మక బురుజుపై ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ జాతీయ జెండాను ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో సిద్దిపేట బురుజు కొత్త శోభ సంతరించుకుంది.

మరోవైపు మంత్రి కేటీఆర్ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజ‌మైన స‌మాఖ్య‌స్ఫూర్తి ప‌రిఢ‌విల్లేలా భార‌త ప్ర‌జాస్వామ్య గ‌ణ‌తంత్ర వ్య‌వస్థ బ‌ల‌ప‌డాల‌ని ఆకాంక్షిస్తూ దేశ ప్ర‌జ‌లంద‌రికీ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.