కరోనా కట్టడి కోసం విఢించిన లాక్డౌన్తో ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ కష్టకాలంలో ఇళ్ల యజమానులు అద్దె కోసం కిరాయిదారులను వేధించవద్దని స్పష్టం చేశారు. మార్చి, ఏప్రిల్, మే నెలల ఇండ్ల అద్దెలు వసూలు చేయొద్దని సూచించారు. లాక్డౌన్ కారణంగా ఆదాయం లేకుండా పోయిందని.. యజమానులు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత విడతల వారీగా ఆ అద్దె మొత్తం వసూలు చేసుకోవాలని సూచించారు. ఆ సాకుతో వడ్డీ వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇది విజ్ఞప్తి కాదని.. ఆదేశం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇబ్బంది పెట్టే ఓనర్ల మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు ఉన్నాయని వివరించారు. మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ ట్యాక్స్లు చెల్లించే విషయంలోనూ సడలింపులు ఇచ్చారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మే 31 వరకు పన్నులు చెల్లించుకోవచ్చని సూచించారు.
ప్రైవేట్ పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలు ఉల్లంఘించకూడదని కేసీఆర్ స్పష్టం చేశారు. 2020-21 విద్యా సంవత్సరానికి ఫీజులు పెంచకూడదని ఆదేశించారు. రకరకాల ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను వేధించవద్దని.. ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు.
తెల్ల రేషన్ కార్డులకు మే నెలలోనూ 12 కిలోల బియ్యం ఉచితంగా అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన రూ.1500 కోసం బ్యాంకుల దగ్గర క్యూ కట్టడం అవసరం లేదని.. ఆ డబ్బులు ఎక్కడికీ పోవని తెలిపారు. ఖాతాదారులు తమకు ఇష్టమొచ్చినప్పుడు తీసుకోవచ్చని చెప్పారు. బ్యాంకుల వద్ద రద్దీకి కారణం కావొద్దని సూచించారు.
Also Read: నిమ్స్ నర్సుకు కరోనా.. రోగికి చికిత్స చేసిన వారందరిలో టెన్షన్!
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్డౌన్ స్థితిగతులపై మంత్రులు, అధికారులతో ఆదివారం (ఏప్రిల్ 19) సుదీర్ఘంగా చర్చించిన సీఎం కేసీఆర్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో మే 7 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. కానీ, తెలంగాణలో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు.
ఇది విజ్ఞప్తి కాదని.. ఆదేశం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇబ్బంది పెట్టే ఓనర్ల మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు ఉన్నాయని వివరించారు. మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ ట్యాక్స్లు చెల్లించే విషయంలోనూ సడలింపులు ఇచ్చారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మే 31 వరకు పన్నులు చెల్లించుకోవచ్చని సూచించారు.
ప్రైవేట్ పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలు ఉల్లంఘించకూడదని కేసీఆర్ స్పష్టం చేశారు. 2020-21 విద్యా సంవత్సరానికి ఫీజులు పెంచకూడదని ఆదేశించారు. రకరకాల ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను వేధించవద్దని.. ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు.
తెల్ల రేషన్ కార్డులకు మే నెలలోనూ 12 కిలోల బియ్యం ఉచితంగా అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన రూ.1500 కోసం బ్యాంకుల దగ్గర క్యూ కట్టడం అవసరం లేదని.. ఆ డబ్బులు ఎక్కడికీ పోవని తెలిపారు. ఖాతాదారులు తమకు ఇష్టమొచ్చినప్పుడు తీసుకోవచ్చని చెప్పారు. బ్యాంకుల వద్ద రద్దీకి కారణం కావొద్దని సూచించారు.
Also Read: నిమ్స్ నర్సుకు కరోనా.. రోగికి చికిత్స చేసిన వారందరిలో టెన్షన్!
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్డౌన్ స్థితిగతులపై మంత్రులు, అధికారులతో ఆదివారం (ఏప్రిల్ 19) సుదీర్ఘంగా చర్చించిన సీఎం కేసీఆర్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో మే 7 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. కానీ, తెలంగాణలో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు.