యాప్నగరం

కేసీఆర్ గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటినుంచంటే..

KCR: జూలై 26 నుంచి 31వ తేదీ వరకూ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు అగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయాలని సీఎం స్పష్టం చేశారు.

Samayam Telugu 15 Jul 2021, 9:25 pm
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు అతి త్వరలో రేషన్ కార్డులు అందనున్నాయి. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పైచిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ తెలిపారు.
Samayam Telugu కేసీఆర్ (ఫైల్ ఫోటో)
kcr on review


జూలై 26 నుంచి 31వ తేదీ వరకూ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు అగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయాలని సీఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.