యాప్నగరం

వర్థంతి వేళ పీవీని గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్

పీవీకి ఘనమైన నివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతతో నిర్వహిస్తుందని కేసీఆర్ తెలిపారు. అటు పలువురు టీఆర్ఎస్ నేతలు సైతం పీవీకి ఘన నివాళులర్పించారు.

Samayam Telugu 23 Dec 2020, 12:21 pm
ఇవాళ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్థంతి. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవల్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేేసీఆర్ స్మరించుకున్నారు. 16వ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. నిరంతర సంస్కరణ శీలిగా భారత దేశ చరిత్రలో పీవీ చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం అన్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాలలో పి.వి.నరసింహా రావు ప్రవేశపెట్టి, అమలు చేసిన సంస్కరణల ఫలితాన్ని ఇవాళ మన భారత దేశం అనుభవిస్తున్నదని అభిప్రాయపడ్డారు కేసీఆర్.
Samayam Telugu పీవీకి కేసీఆర్ ఘన నివాళి
kcr on pv


అంతర్గత భద్రత వ్యవహారాల్లోనూ, విదేశాంగ వ్యవహారాల్లోనూ పీవీ అవలంభించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి భారత దేశ సమగ్రతను, సార్వభౌమాత్వాన్ని పటిష్ఠపరిచిందని కొనియాడారు. బహు భాషా వేత్తగా, బహు ముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పీవీకి ఘనమైన నివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతతో నిర్వహిస్తుందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.

Read More: మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

మరోవైపు నెక్లెస్‌రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఆమెతో పాటు పీవీ కుమార్తె శ్రీవాణి, కుమారుడు పీవీ ప్రభాకర్ రావు ఉన్నారు. పీవీ జ్ఞానభూమి వద్ద నివాళులర్పించిన వారిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కేశవరావు, హోంమంత్రి మహముద్ అలీతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.