యాప్నగరం

CM KCR: సాయంత్రం కేసీఆర్ మీడియా సమావేశం.. BRS భవిష్యత్తుపై కీలక ప్రకటన

CM KCR: సీఎం కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. బీఆర్ఎస్ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేసే అవకాశముంది. మునుగోడు అభ్యర్థితో పాటు చుండూరు సభ తేదీలపై క్లారిటీ ఇస్తారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కీలక వివరాలను కేసీఆర్ బయటపెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఏయే పార్టీలతో కలుస్తారనే విషయాలను చెబుతారని నేతలు అంటున్నారు.

Samayam Telugu 5 Oct 2022, 11:03 am
CM KCR:తెలంగాణ రాజకీయాల్లో నేడు సంచలన పరిణామం చోటుచేసుకుంటోంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి జాతీయ పార్టీగా అవతరించనుంది. ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరగనుండగా.. భాగ్యనగరం మొత్తం గులాబీమయంగా మారింది. ఎక్కడ చూసినా గులాబీ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు 300కిపైగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఫ్లెక్సీలతో పాటు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల బ్యానర్లను తెలంగాణ భవన్ లో ప్రదర్శించారు.
Samayam Telugu kcr


ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం అయిన తర్వాత టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానం కాపీలపై నేలలందరూ సంతకాలు చేయనున్నారు. అనంతరం ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం 1.19 గంటలకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ప్రకటిస్తూ ప్రకటన చేయనున్నారు. అనంతరం టీఆర్ఎస్ నేతలతో కలిసి మధ్యాహ్నం తెలంగాణ భవన్ లోనే కేసీఆర్ లంచ్ చేయనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జాతీయ పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి మద్దతు ప్రకటించారు. ఇక తమిళనాడుకు చెందిన మరో ప్రాంతీయ పార్టీ కూడా బీఆర్ఎస్ కు మద్దతు పలికింది.

జాతీయ పార్టీపై రేపు సీఈసీకి టీఆర్ఎస్ అఫిడవిట్ అందించనుంది. దీని కోసం సాయంత్రం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ఢిల్లీ బయలుదేరనుంది. రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేసిన తీర్మానం కాపీలతో పాటు ఇతర డాక్యుమెంట్లను అందించనున్నారు. రేపటి నుంచి ఇక టీఆర్ఎస్ ఉండదని, బీఆర్ఎస్ గానే పార్టీ ఉంటుందని గులాబీ నేతలు చెబుతున్నారు. మునుగోడు ఉపఎన్నికలో కూడా బీఆర్ఎస్ పార్టీపైనే పోటీ చేసే అవకాశముందని చెబుతున్నారు. సాంకేతికంగా దీనికి ఎలాంటి అడ్డంకులు ఉండవని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం మీడియా సమావేశంలో మునుగోడు అభ్యర్ధితో పాటు బీఆర్ఎస్ భవిష్యత్తు, మునుగోడు నియోజకవర్గం చుండూరులో నిర్వహించనున్న బహిరంగ సభపై క్లారిటీ ఇచ్చే అవకాశముంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.