యాప్నగరం

ఆ చవకబారు ప్రచారం నాకక్కర్లేదు : కేసీఆర్

Telangana CMO: తెలంగాణ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునే వ్యూహాల్లో భాగంగా కార్గో సర్వీసులను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ప్రయాణికుల చేరవేతకు అనుకూలంగా లేని పాత బస్సులను కార్గో సేవలకోసం వినియోగించనున్నారు.

Samayam Telugu 5 Feb 2020, 8:54 am
ఆర్టీసీ నుంచి త్వరలో ప్రారంభం కానున్న సరకు రవాణా బస్సులపై సీఎం కేసీఆర్‌ ఫొటోలు చిత్రీకరించనున్నారని వస్తున్న ప్రచారంపై కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కార్గో బస్సులపై తన చిత్రాలను ఏర్పాటు చేయడాన్ని కేసీఆర్‌ తప్పుపట్టినట్లు సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్టీసీ బస్సులను సరకు రవాణాకు వాడటం వల్ల ప్రజలకు సేవలు అందించడం, ఆర్టీసీ లాభాల్లో పయనించడమే తన లక్ష్యం అని సీఎం అన్నారు. బస్సులపై ఫొటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు సీఎంవో పేర్కొంది.
Samayam Telugu kcr


Also Read: లైంగిక ఆరోపణలపై స్పందించిన బీజేపీ నేత రఘునందన్

ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల ద్వారా ప్రజలకు దగ్గర కావాలిగానీ.. చవకబారు ప్రచారాలతో ప్రయోజనం పొందాలనుకోవడం తనకు ఇష్టం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటి అంశాలను తాను ప్రోత్సహించబోనని తేల్చిచెప్పారు. మరోవైపు కార్గో బస్సులపై సీఎం ఫొటోలు వద్దంటూ ఆర్టీసీకి సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది.

Also Read: హైదరాబాద్ మెట్రో మొదటి దశ చివరి ఘట్టానికి ముహూర్తం ఖరారు.. ప్రత్యేకతలివే

తెలంగాణ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునే వ్యూహాల్లో భాగంగా కార్గో సర్వీసులను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ప్రయాణికుల చేరవేతకు అనుకూలంగా లేని పాత బస్సులను కార్గో సేవలకోసం వినియోగించనున్నారు. సరకు రవాణాకు అనుకూలంగా బస్సుల డిజైన్‌లోనూ స్వల్ప మార్పులు చేశారు. ఈ బస్సులను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు.

Also Read: మేడారం జాతరపై పార్లమెంట్‌లో ప్రస్తావన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.