యాప్నగరం

తెలంగాణలో వర్షాలు వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష

వరద సహాయక చర్యలకు ఎంత ఖర్చు అయినా వేనుకాడొద్దన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలనుకున్నారు.

Samayam Telugu 17 Aug 2020, 8:09 pm
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు కురుస్తున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ పలు ఆదేశాలను అధికారులకు జారీ చేశారు. రాష్ట్రంలో మరో 3, 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని... కావున అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఎంత ఖర్చు అయినా వెనుకాడద్దని తెలిపారు.
Samayam Telugu కేసీఆర్ సమీక్ష
cm kcr


తెలంగాణ వ్యాప్తంగా గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే వాగులు నదులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. మరో మూడు నాలుగు రోజుల పాటు భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేశారు. దీంతో నేపథ్యంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని సూచించారు.
Read More: వరద బాధిత ప్రాంతాల్లో ఈటల రాజేందర్ పర్యటన
ఎక్కడికక్కడ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి 24 గంటల పాటు నిరంతరాయంగా పరిస్థితిని పర్యవేక్షించాలని కేసీఆర్ ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడవద్దని, అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నాయని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి ప్రతీ రోజు నివేదిక తెప్పించుకుని, పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో భారీ నష్టం కలగకుండా చర్యలు తీసుకున్న మున్సిపల్ శాఖను కేసీఆర్ అభినందించారు.

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం తడిసి ముద్దయింది. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలదిగ్భందమయ్యాయి. అనేక చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పరిస్థితిని సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లాల వారీగా సమాచారం తెలుసుకొని తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు, సూచనలు జారీ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.