యాప్నగరం

కేసీఆర్ అత్యున్నత సమీక్ష.. కరోనా కట్టడి వ్యూహాలు మార్చేలా ప్రణాళికలు!

hyderabad lockdown updates: హైదరాబాద్ పరిధిలో విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో పకడ్బందీ వ్యూహాలు అమలు చేయాలని గతంలోనే సీఎం కేసీఆర్ ఆదేశించారు. మళ్లీ దీనిపైనా ముఖ్యమంత్రి సమీక్ష జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 15 Apr 2020, 8:07 pm
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిరోధించడం సహా లాక్ డౌన్ అమలవుతున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటుచేసిన ఈ సమీక్షకు వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పదుల సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకూ చేపట్టిన పనులపై వస్తున్న ఫలితాలను ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలు తీరుపైనా అడిగి తెలుసుకుంటున్నారు.
Samayam Telugu kcr corona.


Also Read: undefined

ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో పకడ్బందీ వ్యూహాలు అమలు చేయాలని గతంలోనే సీఎం కేసీఆర్ ఆదేశించారు. మళ్లీ దీనిపైనా ముఖ్యమంత్రి సమీక్ష జరుపుతున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని మోదీ ప్రకటన చేసిన వేళ, అందుకు అనుగుణంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపైనా కేసీఆర్‌ అధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. కేంద్రం బుధవారం విడుదల చేసిన మార్గదర్శకాలు.. ఈనెల 20వ తేదీ తర్వాత ఇవ్వాల్సిన మినహాయింపులపై అధికారులతో సీఎం సమీక్షిస్తున్నారు.

Also Read: అసదుద్దీన్ ఒవైసీపై పిచ్చి తిట్లు.. ఎప్పుడైనా తిండి పెట్టావా అని ఫైర్, వీడియో వైరల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.