యాప్నగరం

ప్రతి నియోజవర్గంలో ఆధునిక మార్కెట్లు.. కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్: సీఎం కేసీఆర్

Telangana Assembly: తెలంగాణలోని అన్ని నియోజవర్గాల్లో అత్యాధునికి వసతులతో వెజ్, నాన్‌వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 12 Feb 2023, 4:01 pm

ప్రధానాంశాలు:

  • కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కేసులు
  • అన్ని నియోజకవర్గాల్లో ఆధునిక మార్కెట్లు
  • అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వెల్లడి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu kcr
తెలంగాణ సీఎం కేసీఆర్
Telangana Assembly: కల్తీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుడు అంజయ్య యాదవ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ విత్తనాల బెడద ఎక్కువగా ఉందని నకిలీ విత్తనాల అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి సూచించారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్లపైనా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని చాలా మార్కెట్లు పరిశుభ్రంగా లేవని అన్నారు. దాదాపు 100 ఏళ్ల క్రితం నిజాంల కాలంలో నిర్మించిన మెండా మార్కెట్ చూసి తాను ఆశ్యర్యపోయానని సీఎం అన్నారు. అప్పట్లో కట్టిన మోండా మార్కెట్ ఇప్పటికి సైంటిఫిక్‌గా ఉందన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు మోండా మార్కెట్ చూపించామని ఆ తరహా వెంటిలేషన్, కాన్సెప్ట్‌తో మార్కెట్లు నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు ప్రతి నియోజకవర్గంలోనూ మోడ్రన్ పద్ధతిలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.

ఆహారం తినే సమయంలో క్రీములు, బాక్టీరియా బారి నుంచి కాపాడుకునేందుకు విదేశీయులు డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్‌ను ఫాలో అయ్యారన్నారు. తినే ఆహార పదార్థాలను రెండున్నర ఫీట్ల ఎత్తులో ఉంచాలని అదే కాన్సెప్ట్‌తో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మిస్తున్నట్లు సీఎం చెప్పారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.