యాప్నగరం

గుడ్‌న్యూస్ చెప్పి సీఎం KCR.. వారికి గౌరవభృతి పెంపు, ఇకపై నెలకు రూ.5 వేలు

KCR: తెలంగాణలోని అర్చకుల గౌరవనభృతిని పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం ప్రతినెలా రూ.2,500 ఇస్తుండగా.. ఇక నుంచి రూ.5 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. భృతి అర్హతను కూడా 75 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు తెలిపారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 31 May 2023, 1:21 pm

ప్రధానాంశాలు:

  • అర్చకులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్
  • గౌరవభృతి పెంచుతూ నిర్ణయం
  • ఇక నుంచి ప్రతి నెలా రూ. 5 వేలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu kcr
కేసీఆర్
Viprahitha Telangana Brahmana Samkshema Sadan: తెలంగాణలోని అర్చకులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. బ్రహ్మణ పరిషత్ ద్వారా వేదశాస్త్ర పండితులకు ప్రతినెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2500 నుంచి రూ. 5 వేలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటంచారు. హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోవర్గపరిధలోని గోపన్‌పల్లిలో నిర్మించిన విప్రహిత బ్రహ్మణ సంక్షేమ సదనాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు. 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవనాన్ని పీఠాధిపతులు, వేద పండితులతో కలిసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు.
బ్రహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వేదశాస్త్ర పండితులకు ఇస్తున్న గౌరవ భృతిని రూ. 5 వేలకు పెంచటంతో పాటు ఆ భృతిని పొందేందుకు ఉన్న అర్హత వయస్సును 75 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే మరో 2,796 దేవాలయాలకు దూపదీప నైవేధ్యం పథకం కింద డబ్బులు మంజూరు చేస్తామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాల‌యాల‌కు ధూప‌దీప నైవేద్య ప‌థ‌కం వ‌ర్తిస్తుందని.. మ‌రో 2,796 దేవాల‌యాల‌ు కలిపి మెుత్తం 6,441 దేవాయాలకు ధూప‌దీప నైవేద్యం కింద నిర్వహణ వ్యయం ఇస్తామని చెప్పారు.

ఇప్పటి వరకు ధూప‌దీప నైవేద్యం ప‌థ‌కం కింద దేవాల‌యాల నిర్వహణ కోసం అర్చకులకు నెల‌కు రూ. 6 వేల చొప్పున ఇస్తుండగా.. ఇక నుంచి ఆ మెుత్తాన్ని రూ. 10 వేలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. వేద పాఠ‌శాల‌ల నిర్వహణ కోసం ఇస్తున్న రూ. 2 లక్షలను ఇక నుంచి యాన్యువ‌ల్ గ్రాంట్‌గా ఇస్తామ‌ని సీఎం వెల్లడించారు. ఐటీఎం, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో చదివే బ్రహ్మణ విద్యార్థుల‌కు ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని వర్తింపజేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అనువంశిక అర్చకుల సమస్యలను సైతం త్వరలోనే కేబినెట్‌లో చ‌ర్చించి పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.