యాప్నగరం

సీఏఏపై అనుమానాలున్నాయ్.. నిదానంగా చర్చిద్దాం: సీఎం

TS Assembly: గవర్నర్​ ప్రసంగంపై అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రవేశపెట్టారు. శాసనమండలిలో ఈ తీర్మానాన్ని ప్రభుత్వ చీఫ్​విప్​బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టారు.

Samayam Telugu 7 Mar 2020, 11:30 am
పౌరసత్వ సవరణ చట్టం గురించి అసెంబ్లీలో సవివరంగా చర్చించుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తారని బీజేపీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శాసనసభలో శనివారం మాట్లాడారు. ఏదైనా అంశంపై ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమైన విషయమేనని అన్నారు. సీఏఏపై చాలా అనుమానాలు ఉన్నాయని, అందుకే పార్లమెంటులోనూ వ్యతిరేకించామని చెప్పారు. సీఏఏపై టీఆర్ఎస్ పార్టీ తీరును బీజేపీ తప్పుబట్టడం సరికాదని అన్నారు. ప్రతి పార్టీ సిద్ధాంతాలు వేర్వేరుగా ఉంటాయని, దీనిపై రాద్ధాంతం చేయక్కర్లేదని వ్యాఖ్యానించారు.
Samayam Telugu kcr


గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రవేశపెట్టారు. శాసనమండలిలో ఈ తీర్మానాన్ని ప్రభుత్వ చీఫ్విప్బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై శనివారం చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సీఏఏపై స్పష్టతనిచ్చారు. సీఏఏపై బీజేపీ నాయకుడు రాజాసింగ్ గానీ, ఆ పార్టీ ఇతర నాయకులు గానీ, ఆందోళన చెందొద్దని.. దీనిపై సవివరంగా చర్చిద్దామని సీఎం హామీ ఇచ్చారు. దాని కోసం ప్రత్యేకంగా సగం రోజు కేటాయించుకుందామని చెప్పారు. ఈ సమయంలో దానిపై చర్చించడం సరికాదన్నారు.

Also Read: నకిలీ విజయ్ దేవరకొండ.. లీలలు తెలిస్తే షాక్! పట్టుకున్న పోలీసులు

జీఎస్టీ బకాయిలు కేంద్రం నుంచి రావటం లేదనే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలను సమర్ధిస్తున్నానని సీఎం అన్నారు. మరోవైపు, సీఏఏపై ప్రత్యేకంగా చర్చ నిర్వహించుకుందామని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కూడా హామీ ఇచ్చారు.

Must Read: కరోనా ఎఫెక్ట్: మంత్రి ఈటలకు రూ.8 కోట్లు నష్టం

Also Read: ఆఫీసులోనే స్నానం చేసి రండి.. మంత్రికి ఆయన భార్య ఆదేశం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.