యాప్నగరం

యాదాద్రిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం యాదాద్రి ఆలయ పనులు ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దాదాపుగా 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ పనుల్ని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ యాదాద్రి చేరుకున్నారు.

Samayam Telugu 13 Sep 2020, 3:15 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయం చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్‌కు అర్చకులు చతుర్వేద ఆశీర్వచనం అందించారు. సీఎం వెంట మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, విప్ గొంగిడి సునీత, ఎంపీ సంతోశ్ కుమార్‌, ఇతర నేతలు, అధికారులు ఉన్నారు.
Samayam Telugu యాదాద్రిలో కేసీఆర్ పూజలు
cm kcr at yadadri temple


పూజానంతరం ఆలయ పునరుద్ధరణ పనులను సీఎం పరిశీలిస్తున్నారు. పనులకు సంబంధించి ఆలయ ఈవో గీత, స్థపతి ఆనంద సాయి సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్నారు. అనంతరం పనుల పురోగతిపై ఆలయ అధికారులతో సమీక్ష జరపనున్నారు. పనుల తీరుపై అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో యాదగిరిగుట్టలో ప్రత్యే భద్రత చర్యలు చేపట్టారు పోలీసులు.

Read More: తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ఆలోచన.. వజ్ర బస్సుల్లో కరోనా టెస్టులు

యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకుంది. ఆలయ పనులు ఇప్పటికే తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆలయంలో దాదాపు 90 శాతం పనులు పూర్తయినట్లు సమాచారం. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్.. యాదాద్రికి వెళ్లి స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.