Cm Kcr Supports Lockdown Extension In All Cm's Video Conference With Pm Modi
లాక్డౌన్ను వాటిని తప్పించి కొనసాగించాలి.. మోదీకి కేసీఆర్ కీలక సూచనలు
కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ ను మరో రెండు వారాలు కొనసాగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. లాక్ డౌన్ సమయంలో రైతులు నష్టపోకుండా, ఇటు నిత్యావసర సరకులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉభయతారకంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నడిచేలా చూడాలని అభ్యర్థించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగు గంటల పాటు సాగిన ఈ వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సూచనలు చేశారు. లాక్ డౌన్ కొనసాగించాలన్న ముఖ్యమంత్రి ప్రజల జీవితాలకు, వ్యవసాయానికి, ఆర్థిక అంశాలకు సంబంధించి తన అభిప్రాయాలు వెల్లడించారు. భారతదేశం ఏకతాటిపై నిలబడి కరోనా వైరస్ పై పోరాడుతోందని.. ఇదే స్పూర్తితో కొనసాగాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కరోనాను భారతదేశం చాలా గొప్పగా ఎదుర్కొంటున్నదని అంతర్జాతీయ పత్రికలు కూడా మెచ్చుకుంటున్నాయని చెప్పారు.
Samayam Telugu11 Apr 2020, 7:28 pm
కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ ను మరో రెండు వారాలు కొనసాగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. లాక్ డౌన్ సమయంలో రైతులు నష్టపోకుండా, ఇటు నిత్యావసర సరకులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉభయతారకంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నడిచేలా చూడాలని అభ్యర్థించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగు గంటల పాటు సాగిన ఈ వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సూచనలు చేశారు. లాక్ డౌన్ కొనసాగించాలన్న ముఖ్యమంత్రి ప్రజల జీవితాలకు, వ్యవసాయానికి, ఆర్థిక అంశాలకు సంబంధించి తన అభిప్రాయాలు వెల్లడించారు. భారతదేశం ఏకతాటిపై నిలబడి కరోనా వైరస్ పై పోరాడుతోందని.. ఇదే స్పూర్తితో కొనసాగాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కరోనాను భారతదేశం చాలా గొప్పగా ఎదుర్కొంటున్నదని అంతర్జాతీయ పత్రికలు కూడా మెచ్చుకుంటున్నాయని చెప్పారు.
మీరు అండగా నిలవడం సంతోషం
‘‘కరోనాపై పోరాడేందుకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి కావాల్సిన మద్దతు లభిస్తోంది. మీరు కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. మీరు అండగా నిలవడం మాకు ఎంతో మనోధైర్యం ఇస్తోంది. కరోనాపై జరిగే యుద్ధంలో భారతదేశం తప్పక గెలిచితీరుతుంది. లాక్ డౌన్ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో బాగా ఉపయోగపడింది. కనీసం రెండు వారాల పాటు లాక్ డౌన్ కొనసాగించడం మంచింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇంతకు మించిన మార్గం మరొకటి లేదు. భారతదేశానికి వ్యవసాయమే జీవిక. దేశానికి అన్నం పెట్టడమే కాదు, వ్యవసాయం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది.
వ్యవసాయాధారిత పరిశ్రమలు నడవాలి
135 కోట్ల జనాభా కలిగిన భారతదేశానికి తిండి పెట్టడం మరే దేశానికి కూడా సాధ్యం కాదు. మనం ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధితో ఉన్నాం. ఈ పరిస్థితి కొనసాగాలి. అన్నం పెట్టే రైతుకు అండగా నిలవాలి. అటు వ్యవసాయాన్ని కాపాడేందుకు, ఇటు ప్రజలకు నిత్యావసర సరుకుల కొరత లేకుండా ఉండేందుకు వీలుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నడిచేలా చర్యలు చేపట్టాలి. రైసు మిల్లులు, ఆయిల్ మిల్లులు, ఇతర వ్యవసాయాధారిత పరిశ్రమలు నడిచేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలి.
నరేగాతో తాత్కాలికంగా అనుసంధానించాలి
వ్యవసాయాన్ని నరేగాతో అనుసంధానం చేయాలి. కనీసం రెండు నెలల పాటైనా ఈ విధానం అవలంభించాలి. రైతులు సగం కూలీ డబ్బులు భరిస్తే, మిగతావి నరేగా నిధుల నుంచి చెల్లించే విధానం రావాలి. దీనివల్ల కష్ట కాలంలో రైతులను ఆదుకోవడం సాధ్యమవుతుంది. దేశ వ్యాప్తంగా కోట్లాది టన్నుల పంటలు పండాయి. వీటిని సేకరించడం మన ముందున్న కర్తవ్యం. సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి స్థలం లేదు. ప్రజలకు మూడు నెలలకు సంబంధించిన ఆహార ధాన్యాలు ముందుగానే ఇవ్వడం వల్ల ప్రస్తుతం ఎఫ్సీఐలో ఉన్న నిల్వలు ఖాళీ అవుతాయి. అప్పుడు కొత్తగా వచ్చే పంటలను ఆ గోదాముల్లో నిల్వ చేయవచ్చు.
తెలంగాణలో ఇలా చేస్తున్నాం
రైతులు మార్కెట్లో ఒకేసారి జమ కాకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లోనే 6,849 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం. ఒక్క ధాన్యం సేకరణ కోసమే ప్రభుత్వం 25 వేల కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ ఇచ్చింది. గ్రామాల్లోనే పంటలు కొని, రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. ఇలా సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్సీఐకి అందిస్తున్నాం. దాని నుంచి తిరిగి డబ్బులు రావడానికి నాలుగైదు నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు బ్యాంకులు బకాయిల చెల్లింపు కోసం ఒత్తిడి తేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
వ్యూహాత్మక ఆర్థిక విధానం అవసరం
1918 లో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. 2008లో కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఏర్పడింది. సరైన చర్యలు తీసుకోవడం వల్ల కోలుకోగలిగాం. ఇప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. దీన్ని ఎదుర్కోవడానికి కూడా వ్యూహాత్మక ఆర్థిక విధానం అవసరం. క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానాన్ని ఆర్బీఐ అనుసరించాలి. దీన్నే హెలిక్యాప్టర్ మనీ అంటారు. దీనివల్ల రాష్ట్రాలకు, నిధులు సమకూర్చే సంస్థలకు వెసులు బాటు లభిస్తుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడవచ్చు. జీఎస్టీపీలో 5 శాతం నిధులను క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానం ద్వారా విడుదల చేయాలి.
ప్రధానికి కేసీఆర్ మరికొన్ని సూచనలు
ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3 శాతం నుంచి 5 శాతానికి పెంచాలి. రాష్ట్రాలు చెల్లించే అప్పుల కిస్తీని కనీసం ఆరు వారాల పాటు వాయిదా వేసేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రులతో ఒక టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాలి. లాక్ డౌన్ నేపథ్యంలో వ్యవసాయదారుల కోసం ఏమి చేయాలనే విషయంలో, ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వహించాలనే విషయంలో వ్యూహం ఖరారు చేసి, అమలు చేయాలి.’’ అని సీఎం ప్రధానికి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ తదితరులున్నారు.
Video-లాక్డౌన్ను వాటికి తప్పించి కొనసాగించండి.. మోదీకి కేసీఆర్ కీలక సూచనలు
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.