యాప్నగరం

టానిక్ లాంటి విజయం.. అపోహలు, అనుమానాలు పటాపంచలు: కేసీఆర్

Huzurnagar ప్రజలు అన్ని అనుమానాలు, అపోహలను పటాపంచలు చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. ఉప ఎన్నిక విజయం అద్భుతమన్నారు. విపక్షాలకు హితవు పలికారు.

Samayam Telugu 24 Oct 2019, 6:22 pm
టీఆర్‌ఎస్ పార్టీకి ఘన విజయం అందించిన హుజూర్‌నగర్ ప్రజలకు సీఎం కేసీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తాను పాల్గొనాల్సిన సభ ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రద్దయినా భారీ మెజార్టీతో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించారన్నారు. అది అశామాషీ విజయం కాదని.. అద్భుత విజయమని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందున్న అపోహలు, అనుమానాలన్నింటినీ హుజూర్‌నగర్ ప్రజలు పటాపంచలు చేశారన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించిన నేపథ్యంలో గురువారం (అక్టోబర్ 24) సాయంత్రం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu trs
కేసీఆర్


‘హుజూర్‌నగర్ ఫలితాలతో అధికార మార్పిడి జరిగేది లేదు.. కానీ, ఈ విజయం ఓ టానిక్‌లా పనిచేస్తుంది. ప్రభుత్వానికి మరింత స్పష్టత ఇస్తుంది. విపక్ష నేతలు చాలా దుష్ప్రచారం చేశారు. అసంబద్ధ నిందలు వేశారు. వాటిని పక్కనబెట్టి టీఆర్‌ఎస్ అభ్యర్థికి మంచి మెజార్టీ కట్టబెట్టారు’ అని కేసీఆర్ అన్నారు.

Don't Miss: సమ్మె కొనసాగితే ఆర్టీసీ మూతే.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఉప ఎన్నికలో 50 వేల పైచిలుకు ఓటర్లు టీఆర్‌ఎస్ వైపు మళ్లారని కేసీఆర్ చెప్పారు. 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి 7 వేలకు పైచిలుకు ఓట్లతో ఓటమి పాలవగా.. తాజాగా 43 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారని వివరించారు.

ఎల్లుండే వస్తా..
హుజూర్‌నగర్ ప్రజలు ఆశలు, కోరికలూ తీరుస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎల్లుండి (శనివారం) సాయంత్రమే నియోజకవర్గానికి వస్తానని.. బహిరంగ సభలో పాల్గొంటానని వెల్లడించారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కారాలు సూచిస్తామని చెప్పారు. సభ కోసం ఎన్నికల సంఘం అనుమతి కోరామని.. హుజూర్‌నగర్ ప్రజలకు ధన్యవాదాలు చెప్పి వస్తానని అడిగామని సీఎం వివరించారు.

Must Read: స్విగ్గీ బాయ్ ముస్లిం అని ఫుడ్ రిజెక్ట్.. ఆర్డర్ చేసిన హోటల్ మాత్రం! పాతబస్తీలో షాకింగ్ ఘటన!

నిందించడమే సరైన పద్ధతి కాదని ప్రతిపక్షాలకు సీఎం కేసీఆర్ హితవు పలికారు. అది రాజకీయం కాదని.. పంథా మార్చుకోవాలని సూచించారు. ‘మనది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం.. ఎవరూ శాశ్వతం కాదు. పునర్నిర్మాణం జరిగే క్రమంలో తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదు. ఏ అంశాన్ని ఎత్తుకోవాలో కూడా ప్రతిపక్షాలకు తెలియట్టేదు. గుడ్డెద్దు చేలో పడ్డట్లు వారి పరిస్థితి ఉంది. ప్రజలు తగు రీతిలో గుణపాఠం చెబుతారు. హుజూర్‌నగర్ ఫలితాలు చెప్పే పాఠం ఇదే’ అని కేసీఆర్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.