యాప్నగరం

సంతోష్ బాబు ఇంటికి సీఎం.. అమర జవాన్ కుటుంబానికి అండగా కేసీఆర్

కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడం కోసం సీఎం కేసీఆర్ సోమవారం సూర్యాపేట వెళ్లనున్నారు. ఆయనే స్వయంగా కల్నల్ కుటుంబ సభ్యులకు రూ.5 కోట్ల పరిహారం, ఇంటి పట్టా అందజేయనున్నారు.

Samayam Telugu 20 Jun 2020, 7:22 pm
సీఎం కేసీఆర్ సోమవారం సూర్యాపేట వెళ్లనున్నారు. దేశ రక్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శిస్తారు. ఆయన కుటుంబ సభ్యులకు రూ.5 కోట్ల పరిహారాన్ని, ఇంటి స్థలం పట్టాను సీఎం స్వయంగా అందజేస్తారు. ఇప్పటికే మంత్రి జగదీశ్ రెడ్డి దంపతులు సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం అందజేస్తానన్న సాయాన్ని తీసుకోవడానికి వారు అంగీకరించారని మంత్రి తెలిపారు.
Samayam Telugu కుటుంబాన్ని పరామర్శిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి
Colonel Santosh Babu


కల్నల్ సంతోష్ బాబు పార్థీవ దేహాన్ని లడఖ్ నుంచి హైదరాబాద్ తీసుకురాగా.. నివాళులు అర్పించడానికి గవర్నర్ తమిళిసై వెళ్లారు. కానీ కేసీఆర్ వెళ్లకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శలకు గుప్పించారు. ఈ విమర్శలకు చెక్ పెడుతూ.. సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు రూ.5 కోట్ల పరిహారం, ఆయన భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తామని.. ఇంటి స్థలం అందజేస్తామని సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రి ప్రకటించారు. గాల్వన్ ఘర్షణల్లో అమరులైన మిగతా జవాన్లకు కూడా తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది.

శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కేసీఆర్.. చైనా విషయంలో రాజనీతి కాదు రణనీతిని ప్రదర్శించాలని ప్రధాని మోదీకి సూచించారు. కశ్మీర్ విషయంలో మోదీ సర్కారు వైఖరిని చైనా జీర్ణించుకోలేకపోతోందని.. అందుకే దాడికి దిగుతోందని ఆయన ఆరోపించారు.

Also Read: undefined

శనివారం సాయంత్రం జగదీష్ రెడ్డి ,సునీత దంపతులు కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన వివరాలను సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు మంత్రి జగదీష్ రెడ్డి వివరించారు. కుటుంబ సభ్యుల అభీష్టం మేరకు సోమవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఖరారు చేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. సంతోష్ బాబు సేవలకు గుర్తుగా యువతకు స్ఫూర్తిగా ఉండాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు.

అయితే, ఇంటి జాగా అన్నది సూర్యపేట లేదా హైదరాబాద్ లోనా అన్నది కుటుంబ సభ్యుల ఇష్టానుసారంగా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందన్నారు. అందులో బాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అందించనున్న సాయంపై కుటుంబ సభ్యులతో చర్చించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని వారు స్వాగతించారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.