యాప్నగరం

Kcr Delhi Tour: ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్న కేసీఆర్

ముందుగా హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో పాటు ప్రధానిని కూడా గులాబీ బాస్ కలవనున్నారు.

Samayam Telugu 12 Dec 2020, 8:30 am
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ సీఎం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ప్రధానితో పాటు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీతో కేసీఆర్‌ ఇవాళ సమావేశం కానున్నట్లు తెలిసింది. విభజన హామీలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చిస్తారని సమాచారం.
Samayam Telugu మోదీని కలవనున్న కేసీఆర్
cm kcr to meet modi


Read More: అమిత్ షాతో కేసీఆర్ భేటీ.. ఢిల్లీలో బిజీబిజీగా కేసీఆర్

కేసీఆర్ ప్రస్తుతం దేశ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే నిన్న ఆయన మొదట కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమైన కేసీఆర్.. దాదాపు గంటపాటు చర్చలు జరిపారు.. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై ప్రముఖంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వాలని అమిత్‌ షాను కేసీఆర్‌ కోరారు. పోలీసు వ్యవస్థ నవీకరణకు, వెనకబడిన జిల్లాలకు నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నేడు ప్రధాని మోడీ,

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.