యాప్నగరం

కరీంనగర్‌లో కరోనా అలర్ట్.. సీఎం పర్యటన వాయిదా

Karimnagar: నిజానికి శుక్రవారమే ముఖ్యమంత్రి కరీంనగర్ పర్యటన ఉన్నా.. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫెరెన్స్ ఉన్నందున అది శనివారానికి వాయిదా పడ్డట్లుగా సీఎంవో వివరించింది.

Samayam Telugu 21 Mar 2020, 7:21 am
కరీంనగర్‌లో కరోనా వైరస్ కలకలం రేపిన వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఆ నగరంలో పర్యటించాలని తొలుత నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆఖరి నిమిషయంలో కరీంనగర్ పర్యటనను కేసీఆర్ వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. జిల్లా యంత్రాంగం సూచనల మేరకే పర్యటన వాయిదా పడినట్లుగా వివరించింది. నిజానికి శుక్రవారమే ముఖ్యమంత్రి కరీంనగర్ పర్యటన ఉన్నా ప్రధాని మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ఉన్నందున శనివారానికి వాయిదా పడింది. తాజాగా జిల్లా యంత్రాంగం సూచనతో మరోసారి వాయిదా పడింది.
Samayam Telugu ETfRjsoU8AAmBLq.


Must Read: షాకింగ్! తెలంగాణలో మరింత మంది ఇండోనేసియన్లు, వియత్నామీలు

ఇటీవల కరీంనగర్‌లో ఇండోనేసియా నుంచి వచ్చిన పది మంది బృందం పర్యటించిన సంగతి తెలిసిందే. వారిలో ఏడుగురికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరీంనగర్‌లో యుద్ధ ప్రాతిపదికన కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టింది. జిల్లా మంది గంగుల కమలాకర్ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. 100 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి, ఇండోనేసియా దేశస్థులు తిరిగిన చుట్టుపక్కల ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు చేయించారు. నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నారు.

Also Read: పది పరీక్షలు వాయిదా వేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

కరోనా నియంత్రణ చర్యలపై కరీంనగర్ కలెక్టర్ సమీక్ష
శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె.శశాంక.. నగర సీపీ కమలాసన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, వైద్యాధికారులతో కరోనా వైరస్ నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కరోనా లక్షణాలతో ఉన్న అనుమానితులను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తు్న్నట్లు చెప్పారు. అనుమానితులను హైదరాబాద్ తీసుకెళ్ళెందుకు వాహానాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వైద్య పరీక్షలకు తీసుకువచ్చే అనుమానితుల సెల్ ఫోన్ నెంబర్లు, వారి చిరునామాలను రికార్డు చేయాలని సూచించారు.

Must Read: కరోనా అంతానికి కేంద్రం కఠిన చర్యలివే.. కిషన్ రెడ్డి వెల్లడి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.