యాప్నగరం

7న సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.. ఆ నిధుల విడుదల కోసమే..

Pragathi Bhavan: ఈ భేటీలో వ్యవసాయశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.

Samayam Telugu 5 Dec 2020, 5:09 pm
ఈ నెల 7వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ యేడాది రెండో విడత యాసంగి పంటకు రైతుబంధు సహాయం కోసం నిధుల విడుదల, పంపిణీపై సీఎం ఈ సమావేశంలో సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు.
Samayam Telugu కేసీఆర్
kcr on meet


ఈ భేటీలో వ్యవసాయశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. సమీక్ష అనంతరం రైతుబంధు సాయం కోసం నిధుల విడుదల, పంపిణీపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.