యాప్నగరం

సీఎం కేసీఆర్‌ సోదరి భర్త మృతి

Parvataneni Rajeshwara Rao: సీఎం కేసీఆర్ రెండో సోదరి భర్త అనారోగ్యంతో మృతి చెందారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Samayam Telugu 8 Feb 2020, 11:54 pm
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంట విషాదం నెలకొంది. సీఎం కేసీఆర్‌ రెండో సోదరి భర్త పర్వతనేని రాజేశ్వరరావు (84) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం (ఫిబ్రవరి 8) ఉదయం ఓల్డ్‌ అల్వాల్‌ మంగాపురి కాలనీలో తన నివాసంలో మృతి చెందారు. రాజేశ్వరరావు భౌతికకాయానికి సీఎం కేసీఆర్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు.
Samayam Telugu death


మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావు.. రాజేశ్వరరావు భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే ఓల్డ్‌ అల్వాల్‌‌ చేరుకున్నారు. అంత్యక్రియలు తదితర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పర్వతనేని రాజేశ్వర రావు స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్ల గ్రామం. హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్‌లో స్థిరపడ్డారు. ఆయన అంత్యక్రియలు అల్వాల్‌లోనే జరగనున్నాయి.

నివాళి అర్పిస్తున్న సీఎం కేసీఆర్


Also Read: అమ్మా.. నిన్ను మిస్సవుతున్నా, కన్నీళ్లు పెట్టిస్తున్న కరోనా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.