యాప్నగరం

గవర్నర్ కుర్చీలో కూర్చున్న ఇద్దరు పిల్లలు ఎవరో తెలుసా ?

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కుటుంబాన్ని సత్కరించిన గవర్నర్.. ప్రేమగా ఇద్దరు చిన్నారుల్ని దగ్గరకు తీసుకున్నారు. వారిని తన కుర్చీలో కూర్చోబెట్టుకున్నారు.

Samayam Telugu 27 Jan 2021, 9:55 am
గాల్వన్ లోయలో అమరుడైన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం అరుదైన అవార్డు అందించింది. దేశం కోసం ఆయన చేసిన త్యాగాన్ని గౌరవించింది. సంతోష్ బాబుకు మహావీర చక్ర అవార్డును అందించనున్నట్లు దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కలిశారు. కల్నల్ సంతోష్ బాబుకు మరణాంతరం మహ వీర్ చక్ర అవార్డు ప్రకటించిన సందర్భంగా సంతోష్ బాబు సతీమణి సంతోషి ని ఈరోజు గవర్నర్ గారు సత్కరించారు.
Samayam Telugu కల్నల్ సంతోష్ బాబు ఫ్యామిలీతో గవర్నర్


ఈ సందర్బంగా వారి ఇద్దరు పిల్లల్నికూడా దగ్గరక తీశారు తమిళిసై. వారిద్దర్నీ కూడా గవర్నర్ గారు తన కుర్చీలొ కూర్చోపెట్టారు. అంతేకాదు వారికి బొమ్మలు కూడా ఇచ్చారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. ఇక కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషిని సత్కరించారు. ఆమెకు శాలువా కప్పి షీల్డ్ అందచేశారు. ఈ సందర్భంగా సంతోషి గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

గల్వాన్ లోయలో గత ఏడాది 2020 జూన్ 15న జరిగిన భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు అర్పించిన 20 మంది భారతీయ సైనికుల్లో 16 బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బాబు కూడా ఉన్నారు. గత ఏడాది సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.ఐదు కోట్ల పరిహారం, అతని భార్యకు గ్రూప్ -1 పోస్టుతో పాటు హైదరాబాద్ లో నివాస స్థలం కూడా ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.