యాప్నగరం

RTC strike: ప్రగతి భవన్ ముట్టడి.. రేవంత్ హౌస్ అరెస్ట్, బేగంపేట మెట్రో స్టేషన్ మూసివేత

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సోమవారం ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. పలువుర్ని ఉదయాన్నే అదుపులోకి తీసుకున్నారు.

Samayam Telugu 21 Oct 2019, 10:49 am
17 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించింది. కాంగ్రెస్ పిలుపు మేరకు ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడికి నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. గాంధీ భవన్ నుంచి ర్యాలీగా చేరుకొని ప్రగతి భవన్‌ను ముట్టడించడం కోసం నేతలు యత్నించారు. ప్రగతి భవన్‌ను ముట్టడిస్తారనే సమాచారం ఉండటంతో.. రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందే హౌస్ అరెస్ట్ చేశారు.
Samayam Telugu pragathi bhavan seige1


ప్రగతి భవన్ ముట్టడికి యత్నించే అవకాశం ఉన్న కాంగ్రెస్ నాయకులను ఉదయం ఐదు గంటల నుంచే పోలీసులు అరెస్ట్ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ తీరు పట్ల వారు మండిపడ్డారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నియంత పాలన సాగిస్తున్నారని వారు ఆరోపించారు. కరీంనగర్ టూ టౌన్ పోలీసు స్టేషన్ ముందు కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. జిల్లాల్లోనూ కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేశారు.

Read Also: హుజూర్‌నగర్ ఉపఎన్నిక లైవ్ అప్‌డేట్స్

ముట్టడిని భగ్నం చేయడం కోసం సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బేగంపేట, సికింద్రాబాద్ మధ్య ప్రయాణిస్తోన్న వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. దీంతో సికింద్రాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రగతి భవన్‌కు సమీపంలోని బేగంపేట మెట్రో స్టేషన్‌ను కూడా మూసివేశారు. దీంతో సోమవారం ఇక్కడ మెట్రో రైళ్లు ఆగడం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.