యాప్నగరం

టీఆర్‌ఎస్ అభ్యర్థి ముక్కు కొరికేసిన కాంగ్రెస్ అభ్యర్థి

Nizamabad జిల్లా బోధన్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవ ముదరడంతో కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థి ముక్కు కొరికేశాడు.

Samayam Telugu 22 Jan 2020, 7:27 pm
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్‌లో సంచలన ఘటన చోటు చేసుకుంది. మాటా మాటా పెరగడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ముక్కు కొరికేశాడు. బుధవారం (జనవరి 22) పోలింగ్ సందర్భంగా అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఈ ఘటనకు దారితీసింది.
Samayam Telugu Imran3


32వ వార్డులో కొంత మంది దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపణలు చేసుకుంటూ ఇరువర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఇమ్రాన్‌ కాంగ్రెస్ వాళ్లను ప్రశ్నించారు. దీంతో ఘర్షణ మొదలైంది. ఇరువర్గాల వారు పరస్పరం దాడి చేసుకోవడంతో గొడవ తారస్థాయికి చేరింది. ఆగ్రహానికి లోనైన కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్.. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ ముక్కు, వేలును కొరికేశాడు.

ఈ దాడిలో ఇమ్రాన్ ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు.

Don't Miss: తొలిసారిగా వచ్చా, కానీ నా ఓటు చెల్లుతుందా.. యువతి ఆవేదన

Also Read: కోళ్లు, గొర్రెలు, తులం బంగారం, ఇంటికి 2 లక్షలు.. ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా!

Must Read: 70 దొంగ ఓట్లు.. ఓటుకు రూ.3 వేలు, పెద్ద అంబర్‌పేటలో ఉద్రిక్తత

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.