యాప్నగరం

అప్పుడే స్పందించి ఉంటే ఇబ్బందే ఉండేది కాదు: భట్టి

Telangana Congress: రాష్ర్ట ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే కేసీఆర్ వైన్ షాప్ తెరిచి నాశనం చేశారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆదాయం మీద ఆరాటం ఉంది. కాని పాలన మీద శ్రద్ధ లేదని భట్టి విమర్శించారు.

Samayam Telugu 19 May 2020, 4:53 pm
లాక్ డౌన్ సమయంలో వైన్ షాపులు తెరవడం కరోనా వైరస్ వ్యాప్తి పెరిగేందుకు కారణమవుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క విమర్శించారు. వైన్స్ తెరవడం వల్ల వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరిగే అవకాశం ఉందని అన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సరైన సమయంలో స్పందించి ఉంటే కరోనాతో ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చేది కాదని పేర్కొన్నారు. వలస కార్మికులు, చిరు వ్యాపారుల గురించి ఆలోచించకుండా లాక్‌ డౌన్ విధించారని అన్నారు. లాక్ డౌన్ విధించిన అనంతరం 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని.. వలస కార్మికుల గురించి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆలోచించలేదని విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Samayam Telugu భట్టి విక్రమార్క (ఫైల్ ఫోటో)


రాష్ర్ట ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే కేసీఆర్ వైన్ షాప్ తెరిచి నాశనం చేశారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆదాయం మీద ఆరాటం ఉంది. కాని పాలన మీద శ్రద్ధ లేదని భట్టి విమర్శించారు. ప్రభుత్వం చెప్పిన పంట వేయకపోతే రైతు బంధు ఇవ్వబోమని ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని అన్నారు. ఎకరాకు రూ.కోటి ఆదాయం వస్తుందని చెపుతున్న ముఖ్యమంత్రి రైతులకు ఆ రహస్యం చెప్పితే బాగుంటుందని భట్టి ఎద్దేవా చేశారు.

Also Read: undefined

కరోనా విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క కోరారు. ఇతర రాష్ట్రాల వారిని 14 రోజుల క్వారంటైన్‌ తర్వాతే గ్రామాల్లోకి అనుమతించాలని సూచించారు. మహదేవపురంలో కరోనా పాజిటివ్‌ రావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. క్వారంటైన్‌లో ఉన్న వారికి ప్రభుత్వమే నిత్యావసర సరకులు అందించాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.