యాప్నగరం

రేవంత్ రెడ్డికి ఫైర్‌బ్రాండ్ సపోర్ట్.. సీనియర్లకు షాక్.!

ఐటీఐఆర్ ప్రాజెక్టును తుంగలో తొక్కి కేసీఆర్ నిరుద్యోగులకు శాపంగా మారారని దాసోజు శ్రావణ్ మండిపడ్డారు. బలమైన ఉద్యమాన్ని నిర్మించే దిశగా సాగుతున్న రేవంత్ రెడ్డికి సహకరించాలన్నారు.

Samayam Telugu 16 Feb 2021, 9:05 pm
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగింపు సమయానికి స్వరం మార్చిన సీనియర్లకి షాకిచ్చారు ఆ పార్టీ ఫైర్ బ్రాండ్, జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్. రావిరాలలో నిర్వహించిన రాజీవ్ రైతు రణభేరికి హాజరైన ఆయన అధిష్టానం అనుమతుల్లేవని సీనియర్లు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. పాము ఇంట్లో దూరితే కర్రతో కొడతామా? లేక పర్మిషన్ అడిగి కర్ర పట్టుకుంటామా? అంటూ చురకలంటించారు. కేసీఆర్ అరాచక పాలనను అడ్డుకునేందుకు రేవంత్ కూడా అలానే ముందుకొచ్చారని ఆయన అన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
revanth


టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతిపై దాసోజు శ్రావజ్ మండిపడ్డారు. ఫార్మాసిటీ ఓ బోగస్ సిటీ అని.. పోలీసులను అడ్డుపెట్టుకుని వేల ఎకరాలు కాజేసి అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఐటీఐఆర్‌ని తుంగలో తొక్కారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలని ఆయన కోరారు. అయితే ఆయన సీనియర్లకు పరోక్షంగా కౌంటరివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.

రైతులకు మద్దతుగా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో దీక్ష చేపట్టిన రేవంత్.. అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అయితే ఆయన పాదయాత్రకు అధిష్టానం అనుమతి లేదని సీనియర్లు దూరంగా ఉన్నారు. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలోనే అధిష్టానం పాదయాత్రకు అనుమతినిచ్చిందని.. ఆయన పొరుగు నియోజకవర్గాల్లోనూ పాదయాత్ర చేయడం సీనియర్లకు మింగుడుపడడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీనియర్లు హ్యాండిచ్చినట్లు అవగతమవుతోంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.