యాప్నగరం

టీపీసీసీ చీఫ్ ఎంపికలో ఉత్కంఠ... సోనియాను కలిసిన కోమటిరెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ నాలుగు రోజుల పాటు తెలంగాణలో ఉండి టీపీసీసీ పదవిపై పలువురి అభిప్రాయలు సేకరించారు. ఆయన హైకమాండ్‌కు నివేదిక కూడా అందించారు.

Samayam Telugu 16 Dec 2020, 2:14 pm
తెలంగాణలో కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఎవరు? అధిష్టానం ఎవర్ని నియమిస్తారు అనే అంశం ఇప్పుడు తెలంగాణలో ఆసక్తికరంగా మారింది. ఈ పదవి రేసులో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు రేసులో ఉన్నారు. ఈ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో పాటుగా యువ నేతలు సైతం పోటీ పడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ నాలుగు రోజులపాటు తెలంగాణలోనే ఉండి నేతల నుంచి అభిప్రాయాలను సేకరించారు. అభిప్రాయాల నివేదికను మాణిక్యం ఠాకూర్ సోనియా గాంధీకి అందజేశారు.
Samayam Telugu congress leader komatireddy venkat reddy meets sonia gandhi over tpcc chief post
టీపీసీసీ చీఫ్ ఎంపికలో ఉత్కంఠ... సోనియాను కలిసిన కోమటిరెడ్డి


Read More: సాగర్ ఉప ఎన్నిక ఎప్పుడో చెప్పిన కేసీఆర్.. .. నేతలకు కీలక ఆదేశాలు

అయితే తాజాగా ఇప్పుడు టి పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. ఇందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోనియా గాంధీని కలిశారు. టీపీసీసీ చీఫ్ పదవి తనకు ఇవ్వాలని, తనకు అన్ని అర్హతలు ఉన్నాయని సోనియా గాంధీని కోరారు. కోమటిరెడ్డితో పాటు అనేక మంది నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఎవరికి ఆ పదవిని అప్పగిస్తారు అన్నది మరికొని రోజుల్లోనే తేలిపోతుంది. మొత్తం మీద టీపీసీసీ చీఫ్ పదవి తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. అధిష్టానం ఎవరు పేరు ప్రకటిస్తుందోనని అంతా ఇంట్రస్టింగ్‌గా ఎదురు చూస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.