యాప్నగరం

ఆయన కల్వకుంట్ల ట్విట్టర్ రావు.. పొన్నం ఘాటు విమర్శ

RTC Strike అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. లేకపోతే ఆయనో ద్రోహిగా మిగిలి పోతారని విమర్శించారు.

Samayam Telugu 9 Oct 2019, 6:38 pm
ర్టీసీ సమస్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందించాలని కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ ప్రజల దృష్టిలో ఆయన ఒక ద్రోహిగా మిగిలిపోతారని విమర్శించారు. అవసరం ఉన్నా, లేకున్నా.. ఏ అంశమైనా ట్విటర్‌లో స్పందించే కేటీఆర్‌.. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఎందుకు స్పందించరని పొన్నం ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 9) ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu ponnam


కేటీఆర్‌ అంటే కల్వకుంట్ల తారక రామారావు కంటే కల్వకుంట్ల ట్విట్టర్‌ రావుగానే బాగా ప్రచారంలోకి వచ్చారని పొన్నం ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికలకు ముందు కేసీఆర్‌ హామీ ఇవ్వలేదా అని ఆయన ప్రశ్నించారు.

Also Read: అఖిలప్రియ భర్తపై ఎస్‌ఐ ఫిర్యాదు.. హైదరాబాద్‌లో కేసు

‘50 వేల ఆర్టీసీ కార్మికుల బాధ మీకు కనబడటం లేదా? ఉద్యోగాలు తొలగిస్తే వారి కుటుంబాలు రోడ్డు మీదకు రావా? ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోవడం లేదు?’ అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

Don't Miss: ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. కేసీఆర్‌కు మిత్రపక్షం వార్నింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.