యాప్నగరం

త్యాగాల చరిత్రకు భోగాల చెద! ఎమోషనల్ అయిన రేవంత్ రెడ్డి

ఎవని పాలయిందిరో తెలంగాణ అంటూ రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. స్వరాష్ట్రం కోసం ప్రాణం ఒదిలినోళ్లు, ప్రాణం పెట్టినోళ్ల చరిత్ర చిన్నబోతోందంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Samayam Telugu 27 Feb 2021, 2:27 pm
కేసీఆర్‌ సర్కార్‌పై ఒంటికాలిపై విరుచుకుపడే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎవని పాలయిందిరో తెలంగాణ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారికి అవమానం జరుగుతోందని.. పాలకుల భోగాలతో చరిత్రకు చెద పడుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం కాంక్షించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన ప్రొఫెసర్ జయశంకర్ సారుకి అవమానం జరుగుతోందంటూ రేవంత్ తీవ్రంగా స్పందించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
revanth reddy


ప్రత్యేక రాష్ట్ర సాధనే ఊపిరిగా బతికిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరణానంతరం మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం హన్మకొండలోని ఏకశిల పార్క్‌ బిల్డింగ్‌లో ఉంచి నివాళులర్పించారు. ఆ సందర్భంగా పార్క్‌ని జయశంకర్ సార్ స్మృతివనంగా మార్చేందుకు నిర్ణయించారు. అందులో భాగంగా నాలుగున్నర కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే జయశంకర్ సార్ స్మృతి వనంలో చెక్కిన చిత్రపటాలపై రేవంత్ ఫైర్ అయ్యారు.

జయశంకర్ సార్ ఫొటోల కంటే సీఎం కేసీఆర్ ఫొటోలే పెద్ద సైజులో ఉండడం.. మహామనిషిని అవమానించడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘త్యాగాల చరిత్రకు భోగాల చెద! స్వరాష్ట్రం కోసం ప్రాణం ఒదిలినోళ్లు, ప్రాణం పెట్టినోళ్ల చరిత్ర చిన్నబోతోంది. ఉద్యమ మార్గదర్శి జయశంకర్ ‘సారు’ ఒక్కడికే జరిగిన పరాభవం కాదు ఇది. రాష్ట్రమే కాంక్షగా.. ఉద్యమమే శ్వాసగా బతికిన ప్రతి తెలంగాణ బిడ్డకు జరిగిన అవమానం. ‘ఎవని పాలయిందిరో తెలంగాణ...?’’ అంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.