యాప్నగరం

షబ్బీర్ అలీకి చేదు అనుభవం.. అడ్డుకున్న ఎంఐఎం.. ఉద్రిక్తత

Telangana Congress: ఐదు రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముంపు ప్రాంతాలలో నివాసమున్న వరద బాధితులను పరామర్శించి వారికి ఆహారం, దుప్పట్లు, ఆర్థిక సహాయం అందించేందుకు వస్తే ఎంఐఎం పార్టీ నేతలు అడ్డుకోవడం దారుణం అని షబ్బీర్ అలీ మండిపడ్డారు.

Samayam Telugu 18 Oct 2020, 9:12 pm
చాదర్ ఘాట్ మూసీ పరివారక ప్రాంత వరద బాధిత ప్రాంతల ప్రజలను పరామర్శించి వారికి ఆహారాన్ని అందిచేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత షబీర్ అలీని మజ్లీస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. పాతబస్తీలో ఇతర పార్టీ నేతలు తిరగవద్దంటూ అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. షబీర్ అలీ మాట్లాడుతూ మజ్లీస్ పార్టీ నేతల గుండా గిరి.. నగరంలో రోజురోజుకీ మితిమీరి పోతుందని విమర్శించారు.
Samayam Telugu ఉద్రిక్తత
shabbir ali


ఐదు రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముంపు ప్రాంతాలలో నివాసమున్న వరద బాధితులను పరామర్శించి వారికి ఆహారం, దుప్పట్లు, ఆర్థిక సహాయం అందించేందుకు వస్తే ఎంఐఎం పార్టీ నేతలు అడ్డుకోవడం దారుణం అని షబ్బీర్ అలీ మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా మానవత్వంతో బాధితులను ఆదుకోవడానికి వచ్చిన వారిని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఐఎం నేతలు ఏ సాయమూ చేయకుండా ఇతరులను సైతం పెట్టకుండా చేస్తున్నారని అన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని అందర్నీ చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.